ఎన్టీఆర్ కెరీర్లో ఆ నాలుగు సంవత్సరాలు నరకం.. అసలేం జరిగిందంటే..!?

Amruth kumar
మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ తన సినీ కెరేర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాంటి ఎన్టీఆర్ కెరియర్ లో సింహాద్రి సినిమా ఎంతో స్పెషల్.. దర్శక ధీరుడు రాజ్యమౌలి డైరెక్షన్లో తెరకెక్కిన వ‌చ్చిన ఈ మూవీ అప్పట్లో కలెక్షల సునామీ సృష్టించింది . అయితే సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి . అలా ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాల ఫలితాలు విషయంలో బాధపడ్డానని ఆ నాలుగేళ్లు నరకం చూసానని తారక్ ప‌లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .
అలా ఆ తర్వాత యమదొంగ సినిమాతో మంచి హిట్ దక్కిందని ఎన్టీఆర్ వెల్లడించారు రాఖీ సినిమా నటుడుగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఆ సినిమా కమర్షియల్ గా ఆశించిన విజయం అందుకోలేదు . అలాగే బృందావనం మూవీ తర్వాత కూడా ఎన్టీఆర్ కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే . అయితే టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ఎన్టీఆర్ కెరియర్ పరంగా వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా . టెంపర్, నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్, జై లవకుశ  , అరవింద సమేత వీర రాఘవ , ఆర్.ఆర్.ఆర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు .
ఇక  తన ప్రతి సినిమా సినిమాకు అంతకంతకు ఎదుగుతున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇప్పటికే రూ . 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి తన తర్వాత వచ్చే సినిమాల పై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు .  ఇక ఎన్టీఆర్ కు కూడా దేవ‌ర‌ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.  ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలుకు తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ భారీగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఇతర భాషల్లో కూడా ఓ రేంజ్ లో పెరిగింది. ఇక మరి ఎన్టీఆర్ నుంచి వచ్చే తర్వాత సినిమాలతో ఇంకేం రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: