ప‌వ‌న్ సుస్వాగ‌తం హీరోయిన్ దేవ‌యాని విఫ‌ల ప్రేమాయ‌ణం... ఆ స్టార్ హీరోతో బ్రేక‌ప్‌..?

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో హీరోయిన్గా నటించారు దేవయాని. దేవయాని అంటే సాంప్రదాయ పాత్రలకు పెట్టింది పేరు. సీనియర్ నటి అయిన దేవయాని ఈతరం సినీ ప్రేమికులకు కూడా పరిచయమే.. ఎన్టీఆర్ అరవింద సమేతలో ఎన్టీఆర్ తల్లిగా - జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పెద్దమ్మగా ... లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి తల్లిగా నటించింది. ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఆమె సినిమాల్లోకి వచ్చిన కొత్తలో హీరోయిన్గా సక్సెస్ కావడంతో పాటు తమిళ - మలయాళ - తెలుగు భాషలలో కలిపి మొత్తం 70 సినిమాలో హీరోయిన్గా నటించింది. మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే తన స్టార్ డం వ‌చ్చినా త‌ర్వాత దానిని నిలుపుకోలేకపోయింది.

ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సంవత్సరాలకే రాజ్ కుమార్ అనే డైరెక్టర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.. అయితే దేవయాని ముందుగా ఓ స్టార్ హీరో తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాల్సి ఉంది ... కానీ ఓ హీరోయిన్ ఎంట్రీ తో దేవయాని - ఆ హీరో పెళ్లికి బ్రేక్ పడింది. దేవయాని పెళ్లి చేసుకోవాలి అనుకున్న హీరో ఎవరో కాదు... కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్. శరత్ కుమార్ - దేవయాని కలిసి కొన్ని సినిమాలలో నటించారు  ...ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.

అదే టైంలో శరత్ కుమార్ జీవితంలోకి సీనియర్ నటి రాధిక వచ్చి చేరింది. అప్పటికే రాధికకు రెండు పెళ్లిళ్లు జరగడంతో పాటు ఆ రెండు వైవాహిక బంధాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే రాధిక - శరత్ కుమార్ కలుసుకోవడం శరత్ కుమార్ ఇబ్బందులలో ఉంటే రాధిక ఆదుకోవడం వీరిద్దరి మధ్య లేటు వయసులో ప్రేమ చిగురించడంతో అనూహ్యంగా దేవయాని సైడ్ అయిపోయింది. రాధిక ప్రేమలో పడిన శరత్ కుమార్ దేవయానిని పక్కన పెట్టేశారు. దేవయాని శరత్ కుమార్ ల మధ్యలో రాధిక ఎంట్రీ తో సీన్ మొత్తం రివర్స్ అయింది అని అప్పటి కోలీవుడ్ జనాలు మాట్లాడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: