నో డౌట్‌.. భ‌ద్ర క‌థ ఖ‌చ్చితంగా బోయ‌పాటిదే.. దేవ‌ర చూశాక అనే మాట ఇది..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో కొనటాల శివ ఒకరు. ఈయన మిర్చి మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ను ప్రారంభించాడు. మిర్చి మూవీ కంటే ముందు ఈయన కథ రచయితగా చాలా సినిమాలకు పని చేశాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా భద్ర అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు సినిమా తర్వాత కొరటాల "భద్ర" సినిమా కథ కి పని చేశాడు.

కానీ ఆయనకు ఆ సినిమా కథ విషయంలో గుర్తింపు దక్కలేదు అని ఓ వార్త బయటకు వచ్చింది. ఇక బోయపాటి దానిపై స్పందిస్తూ ఆ కథపై అనేక మంది పని చేశారు. అందులో ఆయన ఒకడు. అంతేకాని ఆయన ఒక్కడే పూర్తిగా కథ రాయలేదు అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఇక ఈ కథ అక్కడికే ముగిసింది. కాకపోతే మళ్లీ తెరపైకి ఇన్ డైరెక్టుగా ఈ వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన కొరటాల వరుసగా విజయాలను అందుకుంటూ ఆచార్య మూవీతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. తాజాగా దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా కూడా మరి అంత గొప్పగా లేదు అనే టాక్ కొంత మంది ప్రేక్షకుల నుండి వస్తుంది. దానితో ఈయన నిజం గానే భద్ర మూవీ కథ రాశాడా ..? అది బోయపాటి కచ్చితంగా రాసుంటాడు..? ఎందుకంటే అంత గొప్ప కథ రాశాను అన్నాడు ఇప్పుడేమో ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అంటూ కొంత మంది జనాలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దేవర 2 తో అయినా కొరటాల తన పూర్వపు సినిమాల మాదిరి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాలి అని చాలా మంది జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: