ఎడిటర్ ఆ విషయాన్ని చెప్పగానే.. మా నిర్ణయాన్ని మార్చుకున్నాం : తారక్

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకే మూవీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. కాగా ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి.

 ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు దేవర మేకర్స్. దీంతో ఈ మూవీ గురించి ఏదో ఒక విషయం ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. కాగా దేవర మూవీ ని రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ఈనెల 27వ తేదీన విడుదల కాబోతుంది. అయితే ఈ మూవీని ఇలా రెండు పార్ట్ లుగా తెరగెక్కించడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై ప్రమోషన్స్ లో ప్రశ్న ఎదురైంది.

 ఎన్టీఆర్ ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవర మూవీని రెండు భాగాలుగా చేయడం వెనక కారణాలు చెప్పుకొచ్చాడు. రెండు భాగాలుగా తీద్దాం అన్న ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. కానీ సినిమాలో ఎన్నో పాత్రలు ఉంటాయి. కొరటాల కథ రాస్తుంటే ఆపొద్దు అని చెప్పాను. ఓకే సినిమా లో వాటన్నింటినీ గురించి చెప్పడం చాలా కష్టం. అందుకే ఈ సినిమాను రెండు పార్ట్ లుగా చేయాల్సి వచ్చింది. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ సమయానికి 5 గంటల నడిపి వచ్చిందని మా ఎడిటర్ చెప్పాడు. అప్పుడే ఇక రెండు పార్ట్ లు చేయాలని డిసైడ్ అయ్యాం అంటూ తారక్ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: