సమంత, రష్మిక సేమ్ టు సేమ్.. ఎందులో తెలుసా?

Suma Kallamadi
టాలీవుడ్ అందాల భామలు సమంత, రష్మిక మందన్న గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి పేరు వింటే అభిమానులు పరవశంతో పులకించి పోతారు. అందంలోనూ, నటనలోనూ ఇద్దరికీ ఇద్దరే అన్నట్టు నటిస్తారు. అయితే ఇలాంటి హీరోయిన్ అయినప్పటికీ తెరపై అప్పుడప్పుడూ కనిపిస్తుంటేనే.. ఇండస్ట్రీ కూడా గుర్తు పెట్టుకుంటుంది... అదేవిధంగా అభిమానులు కూడా! అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ మైంటైన్ చేస్తుండడంతో అభిమానులు కాస్త నొచ్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఈ ఇద్దరిలోను చాలా కామన్ పాయింట్ ఏమిటంటే... ఖాళీ సమయాల్లో ఫ్యామిలీతో సరదాగా గడపడం.
అవును, ఇద్దరూ పాన్ ఇండియన్ హీరోయిన్లే అయినప్పటికీ ఎక్కడన్నా కాస్త ఖాళీ సమయం చిక్కితే ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ క్రమంలో వారి జ్ఞాపకాలను కెమెరాలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే సోషల్ మీడియాలో కూడా మన హీరోయిన్లు యాక్టివ్ ఉంటారు. ఈ విషయంలో సమంత అందరికంటే ముందుంటారు అని చెప్పుకోవచ్చు. తాజాగా ఇన్‌స్టాలో కొత్త ఫోటోలతో సందడి చేసారు శ్యామ్. ఖుషీ తర్వాత సమంత తెలుగు సినిమాలేవీ చేయలేదు. ముంబైలో మాత్రమే ఉంటూ.. టాలీవుడ్‌కు దూరమవుతున్న వేళ చాలా రోజుల తర్వాత ఇన్‌స్టాలో ఫ్యామిలీ ఫోటోస్ పోస్ట్ చేసారు.
ఇక రష్మిక మందన్న కూడా ట్రెండీ ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా సదరు ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమాల పరంగా రష్మికకు కూడా బ్రేక్ వచ్చిన సంగతి విదితమే. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా షూటింగ్స్‌కు దూరమైన ఈ సుందరి... తాజాగా ఫోటోషూట్‌తో యాక్టివ్ అయింది. కాగా ఈమె పుష్ప 2 కాకుండా... ధనుష్ హీరోగా చేస్తున్న కుబేరా, విక్కీ కౌశల్ చావా.. లేడీ ఓరియెంటెడ్ ది గాళ్ ఫ్రెండ్ సినిమాలతో కాస్త బిజీగా ఉంది. ఇలా ఖాళీ సమయాల్లో మాత్రం సమంత మాదిరి ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: