50 సెకండ్ల పాత్ర కోసం అన్ని కోట్ల పారితోషకం తీసుకున్న నయన్.. ఇండియాలో క్రేజీ రికార్డ్..?

MADDIBOINA AJAY KUMAR
ఇండియన్ సినీ పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లకు హీరోల స్థాయి క్రేజ్ ఉంది. దానితో వారికి కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి అలాంటి వారితో చిన్న చిన్న పాత్రలను చేస్తూ వస్తున్నారు. అలా సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్లు ఇండియన్ సినీ పరిశ్రమలో కూడా కొంత మంది ఉన్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ నయనతార ఒకరు. ఈమె కెరియర్ను తమిళ సినిమాల ద్వారా మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగు లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకొని ఏక కాలంలో అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీలలో వరుస సినిమాలలో నటిస్తూ కొన్ని సంవత్సరాల పాటు రెండు ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించింది.

ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు సినిమాల కంటే కూడా తమిళ్ సినిమాలలో నటించడానికి అత్యంత ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది. కొంత కాలం క్రితం ఈమె షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో షారుక్ కి జోడిగా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. తాజాగా నయనతార టాటా స్కై యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాడ్ కోసం మొత్తం రెండు రోజులు షూట్ చేసినట్లు సమాచారం. రెండు రోజుల పాటు నయనతార పై టాటా స్కై సంబంధించిన యాడ్ ను షూట్ చేయగా అందులో 50 సెకండ్లను మాత్రమే ప్రసారం చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ యాడ్ తమిళ్ , తెలుగు , మలయాళ , కన్నడ , భాషలలో టెలికాస్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 50 సెకండ్ల ప్రకటన కోసం ఈ ముద్దు గుమ్మ ఏకంగా ఐదు కోట్లు తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో నయనతార ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో కాకుండా లేడి ఓరియంటెడ్ మూవీలలో నటిస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: