గుప్పెడంత మనసుని బ్రేక్ చేసిన నటి... విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు?

Suma Kallamadi
మీరు విన్నది నిజమే... మనం చెప్పుకోబోయేది ఒక సీరియల్ నటి గురించి. కేవలం ఆమెను చూడడానికే ఎంతోమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఆమె అందం అభినయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందంలో అప్సరస అయితే, నటనలో మహానటిని మించిపోతుంది ఆ నటి. ఆమె మరెవ్వరో కాదు.... "గుప్పెడంత మనసు" సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన జ్యోతి రాయ్. ఆమె పేరు వినగానే అభిమానుల పెదవులపై చిరునవ్వులు తొనికిసలాడుతాయి. ఆ సీరియల్ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సీరియల్స్ లో ఆఫర్లు సంపాదిస్తూ ఒక హీరోయిన్ కంటే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించింది.
అయితే ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. ఆ విషయం విన్న ఆమె అభిమానులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. విషయం ఏమిటంటే... ఆమె సీరియల్స్ కి టాటా చెప్పేస్తుంది. ఇక ఈ విషయం విన్ననాటి నుండి ఆమె అభిమానులకి నిద్ర పట్టడం లేదని విశ్వసనీ వర్గాల సమాచారం. ఇకపోతే ఆమె సీరియల్స్ కి టాటా చెప్పడంలో ఓ ముఖ్యమైన విషయం దాగి ఉంది. సీరియల్స్ చేసే క్రమంలో ఆమెకి వరుస సినిమాలు చేసే అవకాశం రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బేసిగ్గా కన్నడ పరిశ్రమకు చెందిన జ్యోతిరాయి, మిగతా సౌత్ పరిశ్రమలన్నిటిలోనూ పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో ఆమెకున్నటువంటి అభిమానుల సంఖ్య మరెవ్వరికీ ఉండదు అని చెప్పుకోవాలి.
సినిమాల అవకాశాల కారణంగానే ఆమె, సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆమె శాశ్వతంగా సీరియల్స్ నుండి తొలగిపోతుందా లేదా అన్నదే ప్రశ్న. కానీ బుల్లితెర అభిమానులు మాత్రం ఆమెను కాస్త గ్యాప్ తీసుకుని, మరలా సీరియల్స్ చేయవలసిందిగా కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక మరోవైపు ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే సీరియల్స్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న జ్యోతి రాయ్.. ఒక్కసారిగా సీరియల్స్ మానేస్తే, బుల్లితెర టిఆర్పి రేటింగ్స్ మొత్తం పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొందరు విశ్లేషకులు ఏమంటున్నారు అంటే, జ్యోతి రాయి, సీరియల్స్ విషయంలో కొద్దిగా గ్యాప్ ఇస్తుంది కానీ... సీరియల్స్ పూర్తిగా మానేయడం జరగదని చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: