నటి హేమ సూసైడ్ చేసుకుంటుందట..?

Suma Kallamadi
పాపులర్ లేడీ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ మానసికంగా బాగా అప్సెట్ అయినట్లుగా తెలుస్తోంది అందుకే ఆమె ఇప్పుడు తాను బతికి ఉండి వేస్ట్ అని, తన బరువు అంతా పోయిందని ఇక చచ్చిపోవడమే మేలు అని షాకింగ్ కామెంట్లు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు పట్టణంలో జన్మించిన హేమావయసు ప్రస్తుతం 57 ఏళ్లు. దాదాపు 35 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. 300 దాకా సినిమాల్లో నటించింది. కెరీర్ లైఫ్ పరంగా ఆమె చాలా సక్సెస్‌ఫుల్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆఫ్ స్క్రీన్ లోనే ఆమె కొన్ని తప్పులు చేస్తూ చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తోంది.
కొద్దిరోజుల క్రితం ఆమెను బెంగళూరు డ్రగ్ కేసులో నిందితురాలుగా నమోదు చేశారు పోలీసులు. బెంగళూరులోని రేవు పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ వాడినట్లు పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. విచారణకు రావాలంటూ కోర్టు పోలీసులు ఆదేశిస్తే ఆమె మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని నానా యాగీ చేసి విచారణను ఎగ్గొట్టింది. బెంగళూరులో రేవ్ పార్టీ జరిగినప్పుడు తాను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నానని ఆమె తెలిపింది. అందుకు ఫ్రూఫ్ గా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసింది వాటిలో ఆమె పచ్చళ్ళు లేదా ఏదో వంటకం చేస్తూ కనిపించింది. కానీ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కొద్దిరోజుల్లో జైల్లో వేశారు. దీంతో మా అసోసియేషన్ ఆమె మెంబర్‌షిప్‌ను రద్దు చేసింది. మళ్లీ ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదని టెస్టులు చేయించుకుని నిరూపించాక మా అసోసియేషన్ ఆమెపై బ్యాన్ ను ఎత్తేసింది.
 అయితే హేమ చూపించిన ఆధారాలు, సర్టిఫికెట్లు అన్నీ అబద్ధాలు అని ఆమె డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవమే అని పోలీసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. ఆమెపై చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. దీంతో నోటి దూల ఎక్కువగా ఉన్న హేమ మరింత రెచ్చిపోయింది. కానీ ఇప్పటిదాకా చార్జి షీట్ ను చూడలేదని అప్పుడే మీడియా వారికి అది ఎలా అందిందని ఆమె ఫైర్ అయ్యింది. మీడియాలో తన గురించి వస్తున్న తప్పుడు వార్తలను చూసి తన తల్లి అనారోగ్యం పాలయ్యిందని కూడా ఆమె వాపోయింది. తనకు ఎవరూ డ్రగ్ టెస్టులు చేసిన అతనికి నో ప్రాబ్లం అని కూడా తెలిపింది. అంతేకాకుండా పరువు పోతే తాను ప్రాణాలు తీసుకోవడానికి అయినా సిద్ధమే అని పేర్కొంది.

నిజానికి చేసే ప్రభుత్వం ఉన్న సమయంలో చాలామంది ప్రముఖ నటులపై డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి విచారణకు కూడా హాజరు కావాల్సి వచ్చింది వారందరూ కూడా ఈమెలాగా రచ్చ చేయలేదు పరువు పోయిందని ఏడవలేదు. చనిపోతామని బెదిరించలేదు. ప్రేమకి వారందరి కంటే ఎక్కువ పరువే ఉందని ఆమె చేస్తున్న రచ్చ ద్వారా తెలుస్తోంది. నిజానికి ఇదంతా అనవసరమైన డ్రామా అని కొంతమంది కొట్టి పారేస్తున్నారు. కన్నడలో ఈ తారకు పెద్దగా ఎవరూ తెలియదు. అంత ఎన్ని కేసులు వచ్చినా ఎవరు పట్టించుకోరు అలాంటప్పుడు ఈమె పరువు పోయిందని ఎందుకు ఇలా రచ్చ సృష్టించాలి అనేది సగటు ప్రేక్షకుడు అడుగుతున్న ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: