లావణ్య నుంచి రూ.70 లక్షలు కొట్టేసిన హీరో రాజ్‌ తరుణ్‌ ?

Veldandi Saikiran
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు వీరిద్దరి కేసు సైలెంట్ గా నడిచింది. అయితే రెండు రోజుల నుంచి మళ్లీ లావణ్య అలాగే రాజ్ తరుణ్ కేసు తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 6 అంటే శుక్రవారం రోజున... టాలీవుడ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో ముంబైలో రొమాన్స్ చేస్తుండగా రాజ్ తరుణ్ను రెడ్ హ్యాండెడ్గా దొరక పట్టింది లావణ్య. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.

అంతేకాదు.. హీరోయిన్ మాల్వి , రాజ్ తరుణ్ లను పట్టుకున్న తర్వాత రెచ్చిపోయింది లావణ్య. ఇద్దరినీ బండ బూతులు తిట్టి... రచ్చ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే సరికొత్త ఆరోపణలు రాజు తరుణ్ పైన లావణ్య చేయడం జరిగింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కు లావణ్య పేరెంట్స్ ఏకంగా 70 లక్షల రూపాయలు... ఇచ్చినట్లు లావణ్య తాజాగా సంచలన ఆరోపణలు చేసింది.

ఈ మేరకు నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన తన ఫిర్యాదులో స్పష్టం చేసింది. దాదాపు పది సంవత్సరాలపాటు...  రాజ్ తరుణ్ తో తాను ప్రేమలో ఉన్నట్లు లావణ్య చెప్పడం జరిగింది. కష్టాల్లో ఉన్న రాజ్ తరుణ్ ను.. నేనే పోషించినట్లు కూడా స్పష్టం చేసింది లావణ్య. అదే సమయంలో తన తల్లిదండ్రులు కూడా రాజ్ తరుణ్ కు 70 లక్షల రూపాయల వరకు ఇచ్చారని తెలిపింది.

తన పెళ్లి కోసం ఉంచిన రెండు స్థలాలను అమ్మి మరీ 70 లక్షల రూపాయలు... హీరో రాజ్ తరుణ్ కు ఇచ్చినట్లు లావణ్య స్పష్టం చేసింది. అప్పట్లో హీరో రాజ్ తరుణ్ దాదాపు రెండు సంవత్సరాలు సినిమాలు చేయలేదని తెలిపింది. ఆ సమయంలో అద్దె ఇంట్లో ఉండే వాళ్ళమని ఆమె చెప్పుకొచ్చింది. అప్పుడు అది 60 వేల రూపాయలు ఉండేదని.... ఆ డబ్బులు కూడా తన కుటుంబ సభ్యులే ఇచ్చారని తెలిపింది. కానీ ఇప్పుడు తనను పెళ్లి చేసుకోకుండా హీరో రాజ్ తరుణ్ మోసం చేస్తున్నాడని మండిపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: