విక్రమార్కుడు మూవీలో ఐటెం సాంగ్ చేసిన హీరోయిన్ ఎలా మారిందో చూడండి...?
ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో రవితేజ, అనుష్క హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ పోషించారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించి బ్యాక్ బోన్ గా నిలిచాడు. ఈ సినిమాలో జింతాత సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అంతేకాకుండా విక్రమార్కుడు సినిమాలో "వస్తావా వస్తావా ఒక్కసారి వస్తావా" అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్ ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చింది. అందులో తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించే స్టెప్పులను వేసిన అమ్మాయి మేఘనా నాయుడు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.
ఈ అమ్మడు మరెవరో కాదు మన తెలుగు అమ్మాయి మేఘన నాయుడు. ఈ భామ విజయవాడలో పుట్టి పెరిగి ముంబైలో చదువుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రేమ సాక్షి అనే తెలుగు సినిమాకు ఎంపికయింది. ఆ తర్వాత శ్రీహరి, పృధ్వి నారాయణ, వెండిమబ్బులు వంటి తదితర సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మేఘన కొన్ని సినిమాల్లో బోల్డ్ సీన్లలో నటించి హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.
అందులో భాగంగానే విక్రమార్కుడిలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. విక్టరీ వెంకటేష్ నటించిన "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" సినిమాలో కూడా సందడి చేసింది ఈ బ్యూటీ. అంతేకాకుండా బాలకృష్ణ "పాండురంగడు", నాగచైతన్య "100% లవ్", నాని "పిల్ల జమిందార్" సినిమాల్లోనూ ప్రత్యేకమైన పాటలలో నటించి మెప్పించింది. అయితే గత కొన్నేళ్లుగా వెండితెరపై మేఘన నాయుడు కనిపించడం లేదు. దీంతో ఈ అమ్మడు ఏమైపోయిందని ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేస్తున్నారు.