వామ్మో: తంగాలన్ బ్యూటీ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్..!

Divya
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా తన నటనతో మెప్పించ గలిగిన హీరోయిన్స్ చాలామంది ఉంటారు. ముఖ్యంగా అందానికి అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది మలయాళ నటి పార్వతి తిరువొత్తు.. ఈమె సినిమాలలో నటించిందంటే  చాలు ఎన్నో మంచి మంచి పాత్రలు సైతం గుర్తుకు వస్తూ ఉంటాయి. 2006లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాత్రలలో కూడా నటించింది పార్వతి తిరువొత్తు. ఓటీటీలలో సినిమాలు వెబ్ సిరీస్ ల వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఈమె బెంగళూరు డేస్, చార్లీ, ఉయరే తదితర చిత్రాలలో నటించింది. ఇటీవల విడుదలైన తంగలాన్  చిత్రంలో కూడా ఈమె డీ గ్లామరస్ పాత్రలో అద్భుతంగా నటించింది. మలయాళం లో కూడా ఈమె ఊళ్ళోరుక్కు అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. నటనపరంగా అద్భుతమైన నటి అయినప్పటికీ అదే సమయంలో ఈమె చుట్టూ ఎప్పుడూ కూడా ఎన్నో వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. గతంలో ఈమె మలయాళం సినిమాలలో నటించినప్పుడు హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

హీరో హీరోయిన్లకు అంత రెమ్యూనరేషన్ ఎందుకు అంటూ కూడా ఫైర్ అయ్యింది. 2017లో మమ్ముట్టి వంటి స్టార్ హీరోల పైన కూడా ఊహించని విధంగా కామెంట్స్ చేయడం జరిగిందట.. అలాగే కేరళ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ఈమె మహిళల ను ఇబ్బంది పెట్టేటువంటి డైలాగ్స్ సినిమాలలో ఉండకూడదు అంటూ ఫైర్ అయ్యింది. 2020లో ఏకంగా మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వైదొలగిందట. అంతేకాకుండా ఆ అసోసియేషన్ లో ఉండే ఎడవేల బాబు అనే వ్యక్తి పైన కూడా ఈమె దారుణమైన కామెంట్స్ చేయడం జరిగింది. నయనతార నటించిన అన్నపూరణి సినిమా పై కూడా ఓటీటిలో తొలగించడంపై అసంతృప్తిని తెలియజేసింది. ఇప్పుడు తంగలాన్ సినిమాతో వైరల్ గా మారడంతో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: