డబల్ ఇస్మార్ట్ : బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్.. అలాంటి ఈవెంట్ తో అందరిలో అటెన్షన్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి కొనసాగింపుగా పూరి జగన్నాధ్ , రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్ గా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించగా ... పూరి జగన్నాథ్ , ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు.

ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ మూవీ తెలుగులో విడుదల అద్భుతమైన విజయం సాధించడంతో డబల్ ఇస్మార్ట్ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ బృందం ఈ సినిమాపై అంచనాలను నార్త్ లో భారీగా పెంచాలి అనే ఉద్దేశంలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఎక్కువ ప్రమోషన్ లను హిందీ ఏరియాలో చేయాలి అని ఈ మూవీ బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ భారీ ఈవెంట్ ను ముంబై లో చేయాలి అని ఈ మూవీ బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ ద్వారా ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచే దిశగా ఈ మూవీ యూనిట్ అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా హీరో రామ్ పోతినేని , హీరోయిన్ కావ్య దాపర్ , దర్శకుడు పూరి జగన్నాథ్ ముగ్గురు కూడా అపజయాలలో ఉన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే వీరికి మంచి క్రేజ్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: