యానిమల్ నిర్మాత ఇంట్లో విషాదం..!

Divya
బాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన కృష్ణకుమార్ అందరికీ సుపరిచితమే. బాలీవుడ్ లో బడనిర్మాత సంస్థ అయిన టి సిరీస్ భూషణ్ కుమార్  గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు కృష్ణ కుమార్ చిన్నాన్న వరస అవుతారట. ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న ఈ టి సిరీస్ నిర్మాణ సంస్థలో కృష్ణకుమార్ కూడా ఒక భాగమే అన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా కృష్ణకుమారి ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి. చిన్న వయసులోనే 20 ఏళ్ల వయసులో ఆయన ఏకైక కుమార్తె తీషా కుమార్ మరణించినట్లుగా తెలుస్తోంది. జులై 18న చికిత్స తీసుకుంటూ ఈమె తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. జులై 19వ తేదీన ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

1995లో బేవాష సనమ్ అనే చిత్రంలో కీలకమైన పాత్రలు నటించారు కృష్ణకుమార్. ఆ తర్వాత నటుడుగా కాకుండా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో ఎదిగారు.. పూర్తిగా నిర్మాణ వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవారు.. గత ఏడాది సందీప్ రెడ్డివంగ తెరకెక్కించిన యానిమల్ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్ పైనే నిర్మించారు. టి సిరీస్ నిర్మాత చైర్ పర్సన్ గా కూడా కృష్ణకుమార్ వ్యవహరిస్తూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఈయన కూతురు క్యాన్సర్ సమస్యతో పోరాడుతూ ఉన్నప్పటికీ జర్మనీలో కూడా చికిత్స అందించారట.

కానీ ఆమెను వైద్యులు కూడా కాపాడలేకపోయారని తెలుస్తోంది. తీషా కుమార్ పార్థిహ దేహాన్ని ఇండియాకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే తమ కుమార్తెను పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరు మున్నిరు అవుతున్నారు. దీంతో తీషా కుమార్ మరణం పైన టి సిరీస్ బ్యానర్ పైన ఒక ప్రకటనలను తెలియజేయడం జరిగింది. తన కూతురు క్యాన్సర్ సమస్యతో మరణించిందని దయచేసి ఈ కష్ట సమయంలో కాస్త గోపి అతను గౌరవించాలి అంటూ ప్రకటించడం జరిగింది. దీంతో పలువురు సెలబ్రెటీలు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: