బాలయ్య 'NBK109' షూటింగ్ అప్డేట్ వైరల్..!!

murali krishna
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుస సక్సెస్‌లు అందుకుంటూ ఫుల్ ఫార్మ్ లో ఉన్న బాలకృష్ణ.. ప్రస్తుతం బాబీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. మూవీలోని భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. దాదాపు 20 రోజులు పాటు ఊటీలో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ని తెరకెక్కించారు. ఇక ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన న్యూస్ ని బాబీ తెలియజేశారు.మొన్న జరిగిన ఎన్నికల్లో హ్యాట్ట్రిక్ విక్టరీ సాధించి మంచి ఊపు మీద వున్నా నందమూరి బాలకృష్ణ ప్రజాసేవతో పాటు సినిమాలపై కూడా దృష్టి పెట్టారు.ఇందులో భాగంగానే ఇటీవలే తన 109వ సినిమాను కూడా అనౌన్స్ చేశారు.  ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నారు.. ఈ షూటింగ్ కి సంబందించిన ఒక కీలక షెడ్యూల్ రాజస్థాన్ లో జరగబోతుంది.ఇక ఈ చిత్రం షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ జూలై 21 నుంచి మొదలు కానుంది అని తెలుస్తుంది. అలాగే షెడ్యూల్ లో మేజర్ పార్ట్ అంతా రాజస్థాన్ లో చేస్తారట. ఇలా మొత్తానికి అయితే బాబీ బాలయ్యతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1980 స్టోరీతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటూ సినిమాని ప్రకటించారు. ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో ఫస్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకి పని చేయబోతున్నారట.అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరు చేయబోతున్నారు, అలాగే ఇతర మూవీ క్యాస్ట్ గురించి కూడా తెలియాల్సి ఉంది.సినిమాలు మాత్రమే కాదు.. అన్‌స్టాపబుల్ సీజన్ 4కి కూడా రంగం సిద్ధమవుతోంది. నాలుగో సీజన్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నారు ఆహా. ఈసారి రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారని తెలుస్తుంది.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి సినిమాలు, డిజిటల్‌, రాజకీయాలు, బసవతారకం.. అన్నింటికీ టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: