షాకింగ్ గా మారిన మంచు విష్ణు వ్యూహాలు !

Seetha Sailaja
ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు దాటిపోయినా మంచు విష్ణు ఇప్పటికీ పాపులర్ హీరోగా సెటిల్ కాలేకపోయాడు. ఈ హీరో నుండి ఒక హిట్ సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు దాటిపోయాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య 3వందల కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు తీస్తున్న ‘కన్నప్ప’ మూవీ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీలో అనేకమంది టాప్ ఫిలిమ్ సెలెబ్రెటీలతో పాటు ప్రభాస్ కూడ అతిధి పాత్రలో కనిపిస్తూ ఉండటం మరింత షాకింగ్ గా మారింది. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకుని గ్రాఫిక్ వర్క్స్ పనులలో బిజీగా ఉన్న ఈమూవీ డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లుగా విష్ణు ప్రకటించి అందరికీ మరింత షాక్ ఇచ్చాడు.

డిసెంబర్ నెలలో అనేక భారీ సినిమాలు విడుదలకాబోతున్నాయి. భారీ అంచనాలు ఉన్న ‘పుష్ప 2’ ‘గేమ్ ఛేంజర్’ నాగచైతన్య ‘తండేల్’ నితిన్ ‘రాబిన్ హుడ్’ లతో పాటుగా బాలకృష్ణ బాబీల సినిమాలు కూడ డిసెంబర్ రేస్ పై కన్నేసి ఉన్నాయి. దీనితో డిసెంబర్ నెలలోని ఒక్క శుక్రు వారం కూడ ఖాళీగా లేదు.  ఇలాంటి పరిస్థితుల మధ్య ఇన్ని భారీ సినిమాల మధ్య కన్నప్ప ధైర్యంగా నిలబడి సక్సస్ అవుతుందా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు.

వాస్తవానికి ఈమూవీని ఒక భక్తి సినిమాగా కాకుండా ఒక చారిత్రాత్మక సినిమాగా మంచు విష్ణు తీసినట్లు తెలుస్తోంది. ఈసినిమా మొత్తం న్యూజిలాండ్ లో చాలకష్టపడి ఘాట్ చేశారు. ముఖ్యంగా ఈసినిమాకు గ్రాఫిక్స్ హైలెట్ కాబోతున్నాయి అన్నవార్తలు వస్తున్నాయి. యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండే విధంగా ఈమూవీలో ప్లాన్ చేశారని టాక్. ఇప్పటివరకు ఈ హీరో కెరియర్ లో 100 కోట్ల సినిమాగా మారని పరిస్థితులలో ‘కన్నప్ప’ పై ధైర్యం చేసి 3 వందల కోట్లు పెట్టుబడి పెట్టడం షాకింగ్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: