ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే..?

murali krishna
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 సక్సెస్తో విజయోత్సాహంలో ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రూ.1100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫారెన్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారట! త్వరలోనే దాన్ని ముగించుకుని స్వదేశానికి తిరిగి రానున్నారు.అయితే, ప్ర‌భాస్ నెక్ట్స్ చిత్రాల‌పై అప్పుడే సినీ సిర్కిల్స్ లో జోరుగా చ‌ర్చ సాగుతోంది.తాజాగా సీతారామం త‌ర్వాత త‌న నెక్స్ట్ మూవీ ప్ర‌భాస్‌తోనే చేయ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి పేర్కొన్నాడు. వ‌రంగ‌ల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ ఈవెంట్‌కు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఈ ఈవెంట్‌లో ప్ర‌భాస్ సినిమాపై హ‌ను రాఘ‌వ‌పూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ప్ర‌భాస్ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు తెలిపాడు. ఓ చారిత్ర‌క సంఘ‌ట‌న‌తో ముడిప‌డి ఈ క‌థ సాగుతుంద‌ని తెలిపాడు. ప్ర‌భాస్ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే మూడు పాట‌ల కంపోజింగ్ పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించాడు. హ‌ను రాఘ‌వ‌పూడి కామెంట్స్ వైర‌ట్ అవుతోన్నాయి.

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ‘స్పిరిట్’ అనే సినిమాలో న‌టించ‌నున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్ లో ‘ఫౌజీ’ అనే సినిమాలోనూ ఆయ‌న న‌టిస్తాడు. అయితే, ప్ర‌భాస్ తొలుత ‘స్పిరిట్’ సినిమానే స్టార్ట్ చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆ సినిమా ప్రీ-ప్రొడక్ష‌న్ ప‌నుల‌కు మ‌రింత స‌మ‌యం ప‌డుతుండ‌టంతో, ప్ర‌భాస్ హను రాఘ‌వ‌పూడితో సినిమాను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించాడ‌ట‌.ఈ సినిమా షూటింగ్ అక్టోబ‌ర్ లో స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. స్పిరిట్ చిత్ర షూటింగ్ ను 2025 ప్ర‌థ‌మార్థంలో ప్రారంభించాల‌ని ప్ర‌భాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఫౌజీ సినిమా 1940ల నేప‌థ్యంలో సాగే క‌థ‌గా రాబోతుంద‌ని.. ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రి నిజంగానే ప్ర‌భాస్ ఫౌజీ సినిమాకు ప్రిఫ‌రెన్స్ ఇస్తున్నాడా.. నిజంగానే స్పిరిట్ సినిమాను వ‌చ్చే ఏడాది ప్రారంభిస్తాడా..? అనే విష‌యాల‌పై క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: