అలాంటి రోజు మళ్ళీ రాకూడదు అంటున్న సమంత..!!

murali krishna
ఏమాయ చేసావె’ మూవీతో నిజంగా తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేశారు సమంత రూత్ ప్రభు అలియాస్ సమంత  తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ సినిమాలు చేసి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారామె..రీసెంట్‌‌గా సమంతను గురించి ఓ వార్త.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సమంతా రూత్ ప్రభు బహిరంగ విడాకులు మరియు స్వయం ప్రతిరక్షక వ్యాధి ద్వారా తన ప్రయాణం గురించి తెరిచింది, ఇటీవలి ఇంటర్వ్యూలో ఆధ్యాత్మికతలో ఆమె కనుగొన్న బలాన్ని హైలైట్ చేస్తుంది.“మన జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలను మార్చుకోవాలని అందరం కోరుకుంటాం. నా జీవితం గురించి కూడా అప్పుడప్పుడు ఇలాగే ఆలోచిస్తాను. నాకున్న డబ్బు, హోదాతో సంతోషంగా ఉన్నానా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. జీవితంలో మళ్లీ వెనక్కి వెళ్తే బాగుటుంది అనుకుంటాను. మూడు సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఘటన మర్చిపోలేకపోతున్నాను. అలా జరగకుండా ఉండి ఉంటే బాగుండేదని భావిస్తున్నాను. అయితే, నేను ఆ జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత గతంలో కంటే బలంగా తయారయ్యాను. మానసికంగానూ మెరుగుపడ్డాను. జీవితం మన మీదికి ఎన్నో సవాళ్లను విసురుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నేనూ నా జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నాను. ఆధ్యాత్మికం అనేది ఎన్నో సవావాళ్లను ఎదుర్కొనేలా ధృడ సంకల్పాన్ని కలిగించింది” అని సమంత వెల్లడించింది. నేను కూడా ప్రస్తుతం నా కొత్త పాత్ర కోసం శిక్షణ పొందుతున్నాను; నేను చేపట్టే చాలా ప్రాజెక్ట్‌లు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి నన్ను పురికొల్పుతాయి మరియు నేను దానిని ఇష్టపడుతున్నాను, ”ఆమె చెప్పింది.ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ తో బాలీవుడ్ లో ఎంటర్ అయిన సామ్.. ఇప్పుడు సిటాడెల్ తో ఆ ఎంట్రీని స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఇప్పుడు రాజ్ కుమార్ హీరోయిన్స్ లిస్ట్ లో సామ్ చేరితే.. బాలీవుడ్ హీరోయిన్ గా అమ్మడు సెట్ అయ్యినట్టే అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: