నీ స్థాయికి పాన్ ఇండియా అవసరమా.. గట్టిగా ఇచ్చిపడేసిన కిరణ్ అబ్బవరం?

praveen
ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు తీసిన హీరోలు సైతం ఇక తమ క్రేజ్ ని ఇతర భాషల్లోకి కూడా విస్తరించుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్ను పెంచుకోవడానికి యంగ్ హీరోలు సైతం తమ సినిమాలను తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

 విభిన్నమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అన్న విషయం తెలిసిందే  అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలా పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న చిన్న హీరోలకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇక ఇటీవల ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరానికి కూడా ఇలాగే చేదు అనుభవం ఎదురయింది. ఇటీవల ఒక మూవీకి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో ఒక రిపోర్టర్ ఏకంగా హీరో కిరణ్ ని ఒకప్రశ్న అడిగాడు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలే ఇప్పుడు పాన్ ఇండియా జోలికి వెళ్లడం లేదు. అలాంటిది మీ స్థాయికి పాన్ ఇండియా అవసరమంటారా అనే రీతిలో ప్రశ్న అడిగాడు.

 సాధారణంగా ఏ హీరో అయినా సరే ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు కాస్త అసహనానికి గురవడం చేస్తూ ఉంటారు. కానీ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం ఇలా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కాస్త దీటుగానే బదులిచ్చాడు. దీంతో ఆ హీరో ఇచ్చిన సమాధానం కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇండస్ట్రీలో స్థాయి అనేది కేవలం కంటెంట్ మాత్రమే అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు కిరణ్ అబ్భవరం. మంజుమ్మాల్ బాయ్స్ ఎంత సూపర్ హిట్ అయింది. అందులో నటించిన ఎవరూ కూడా ఎవరికి తెలియదు. అంతెందుకు కాంతారా మూవీలో నటించిన రిషబ్ శెట్టి అప్పటి వరకు ఎవరికీ తెలియదు. కేవలం కంటెంట్ మాత్రమే పాన్ ఇండియా అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: