టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ప్రోమోని మార్ ముంత చోడ్ చింత అనే టైటిల్ తో ఈరోజు సాయంత్రం 5 గంటలకి విడుదల చేసారు. ఫుల్ సాంగ్ జులై 16న విడుదల కానుంది. ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. సాధారణంగా హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్లో నెలకొనే అంచనాలు అంతా ఇంతా కాదు. తొలిపార్టుకు మంచి సీక్వెల్ పార్టు ఉంటుందని ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తుంటారు. కాగా అలాంటి అంచనాలతో రూపొందుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.
ఐదేళ్ల కిందట బాక్సాఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికీ టాలీవుడ్ టాప్-10 మోస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్ లిస్ట్లో ఇది ఒకటి.ఓ వైపు లైగర్ తో భారీ దెబ్బ తిన్న పూరి.. ఈ సారి ఎలాగైనా మాస్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. పైగా సంజయ్ దత్ వంటి బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపడంతో ఈ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు ఒక్కసారిగా ఎగబాకాయి. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు కానీ.. కుదరలేదు. ఇక ఇప్పటికే మాస్ మ్యూజిక్ జాతర అంటూ పూరీ టీం ఫస్ట్ సింగిల్ STEPPAMAAR ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేయగా.. తెగ వైరల్ అయింది.తాజాగా ఈ సినిమా నుంచి మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ ప్రోమోను లాంచ్ చేశారు. ఇస్మార్ట్ శంకర్లో ఫేమస్ అయిన మార్ ముంతా చోడ్ చింతా డైలాగ్నే సాంగ్గా పెట్టి మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు పూరీ. రామ్, కావ్య థాపర్ అండ్ టీంపై పార్టీ మూడ్లో సాగుతున్న ఈ మాస్ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుందని ప్రోమో చూస్తే తెలుస్తుంది.