బచ్చన్ ఫ్యామిలీలో విభేదాలు? రెండుగా చీలిపోయిందా?

Purushottham Vinay
బచ్చన్ ఫ్యామిలీలో విభేదాలు? రెండుగా చీలిపోయిందా? 

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలం నుంచి దేశావ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా ఛానల్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా బలంగా గాసిప్స్ వస్తున్నాయి.ఇక అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన ఐశ్వర్యరాయ్ తన భర్తతో కాకుండా విడిగా రావడంతో ఈ రూమర్లు మరింత పెరిగాయి. ఎందుకంటే అభిషేక్ బచ్చన్ తన తండ్రి, తల్లి, సోదరితో కలిసి అనంత్ అంబానీ పెళ్లికి వచ్చారు. ఐశ్వర్యరాయ్ కేవలం తన కుమార్తె ఆరాధ్యతో కలిసి తర్వాత అక్కడికి విచ్చేశారు. దీంతో గాసిప్ రాయుళ్లు మరింత రెచ్చిపోయారు.అయితే తాజాగా బయటకు వచ్చిన మరో వీడియో గాసిప్ రాయుళ్ల నోళ్లకు గట్టిగా తాళం వేసింది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పక్కపక్కనే కూర్చోవడం వీడియోలో కనిపించింది. 


ఐశ్వర్యరాయ్ ఉత్సాహంగా తన కూతురితో ముచ్చట్లాడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. అభిషేక్ బచ్చన్ మాత్రం వెడ్డింగ్ వేడుకను  చూస్తున్నారు.ఈ వీడియోలో సల్మాన్ ఖాన్, ఎంఎస్ ధోని అతిథులను పలకరిస్తూ కనిపించారు. అయితే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంటను మాత్రం జూమ్ చేసి చూపించడంతో చాలా ఆసక్తికరంగా మారింది. ఇందులో కెమెరాను చూసి ఐశ్వర్యరాయ్ స్మైల్ ఇవ్వడం విశేషం. కాగా తల్లిదండ్రులతో కలిసి వచ్చినప్పటికీ భార్య పక్కనే అభిషేక్ కూర్చోవడంతో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చినట్టైంది. కానీ భర్తతో విభేదాలు లేకపోయినా అత్త మామ లతో విభేదాలు ఉన్నాయనే విషయం కన్ఫామ్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళిలో ఐశ్వర్య అసలు అత్త మమలతో కలవలేదు. కేవలం భర్తతో మాత్రమే కలిసి కూర్చుంది. దీంతో బచ్చన్ ఫ్యామిలీ రెండుగా చీలిందా అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంట మాత్రం జూమ్ చేసి చూపించడంతో చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: