పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం సుజిత్ దర్శకత్వంలో OG అనే మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా కనిపించనుండగా ... ఇమ్రాన్ హాష్మి ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియోను ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు.
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కొద్ది భాగం పూర్తి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడా విడి మొదలు కావడంతో పవన్ వాటిపై దృష్టి పెట్టాడు. ఇక కొన్ని రోజుల క్రితం ఎలక్షన్లు పూర్తి అయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన విజయం దక్కింది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా యొక్క షూటింగ్ ను తిరిగి మొదలు పెట్ట బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.
ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన OG మూవీ కి సంబంధించిన కొన్ని క్రేజీ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ ... పవర్ స్టార్ మరియు నాపై వేరు వేరుగా సన్నివేశాల చిత్రీకరణ కంప్లీట్ అయింది. మా ఇద్దరి కాంబినేషన్లో షూటింగ్ జరగాల్సి ఉంది. ఆ సన్నివేశాలు అద్భుతమైన స్థాయిలో ఉంటాయి. తొలుత ఈ మూవీ రిలీజ్ ను సెప్టెంబర్ లో ప్లాన్ చేయగా ... ఇప్పుడు నిర్మాతలు కొత్త డేట్ కోసం చూస్తున్నారు అని ఈయన తెలియజేశాడు.