పవన్ కళ్యాణ్ "ఓజి" పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ఇమ్రాన్ హష్మీ..!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో చాలా బిజీగా వున్నారు.ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు.అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా కూడా భాద్యతలు చేపట్టారు.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీ లైనప్ లో మూడు భారీ సినిమాలు వున్నాయి.ఆ మూడింటి షూటింగ్స్ పవన్ త్వరలోనే పూర్తి చేయనున్నారు.వాటిలో ముందుగా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయనున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాత ఏఎం రత్నం తెలిపారు.అయితే పవర్ స్టార్ నటిస్తున్న పవర్ ప్యాకెడ్ మూవీ "ఓజి".. స్టార్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా డీవివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే  ఈసినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ ,గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ వుంది అది పూర్తి కాగానే సినిమాను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.అయితే మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.షూటింగ్ పూర్తి కాగానే త్వరలోనే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ఓజి సినిమాలో పవర్ స్టార్ సీన్స్ ,నా సీన్స్ వేరు వేరుగా వున్నవి పూర్తి అయ్యాయి.మేమిద్దరం కలిసి చేసే సీన్స్ త్వరలోనే తెరకెక్కిచానున్నారు.ఆ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ఆయన తెలిపారు.దీనితో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: