తమిళ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టిన మైత్రి సంస్థ.. ఇప్పటికే ఆ ఇద్దరు హీరోలు ఓకే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో మైత్రి సంస్థ ఒకటి. ఈ సంస్థ నుండి మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత వీరి బ్యానర్ లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి మరో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందిన రంగస్థలం కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇలా వరుసగా వీరి బ్యానర్ లో రూపొందిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటూ ఉండటంతో ఈ సంస్థ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఇక ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఈ సంస్థ నిర్మాణ రంగం నుండి డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా తమ బిజినెస్ ను మళ్ళించారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో నైజాం ఏరియాలో అనేక సినిమాలను ఈ సంస్థ విడుదల చేస్తూ వస్తుంది. ఇకపోతే తమిళ సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న రెండు సినిమాల యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది.

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న ది గోట్ మూవీ యొక్క నైజం ఏరియా థియేటర్ హక్కులను మరియు విక్రమ్ హీరోగా రూపొందుతున్న కంగువ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను ఈ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ రెండు సినిమాలను ఈ సంస్థ వారు నైజాం ఏరియాలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే గోట్ , కంగువా సినిమాలపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: