మహేష్ జన్మదినాన అభిమానులకి గుండె పగిలే వార్త?

Purushottham Vinay

టాప్ హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ పాన్ వరల్డ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిన విషయమే.మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతుంది ఆ సినిమా.ఇప్పటికే ఈ మూవీ పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొన్నారు. ఆగస్టు నెలలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా మహేశ్ బర్త్ డే రోజు ఒక్కడు, పోకిరి సినిమాల రీ – రిలీజ్ తో సరికొత్త ట్రెండ్ సృష్టించారు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాన్స్. రీరిలీజ్ లోను బాబు చిత్రాలు రికార్డులు నమోదు చేశాయి. అదే దారిలో మిగిలిన స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా వారి అభిమాన హీరోల సినిమాల రీ రిలీజ్ చేస్తూ ట్రెండ్ కొనసాగించారు.ఇక ఈసారి బాబు పుటిన రోజు నాటికి ఇప్పటి నుండే ఏర్పాట్లు ప్రారంభించారు మహేశ్ ఫ్యాన్స్.

రాజమౌళి చిత్రం ఇప్పట్లో రాదు, బాబుని తెరపై చూడాలంటే చాల కాలం పాటు ఖచ్చితంగా ఎదురుచూడాలి. ఈలోగా మహేశ్ పుట్టిన రోజు కానుకగా బాబు నటించిన మురారి, ఖలేజా సినిమాలు రీరిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కల్ట్ క్లాసిక్ మూవీ "ఖలేజా" కోసం ఫాన్స్ ఆశగా ఉన్నారు. కానీ టెక్నికల్ గా ఖలేజా సినిమా రీరిలీజ్ చేయడం కుదరదని సమాచారం తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ నిరుత్సహపరచకుండా మహేశ్ ను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన మురారి చిత్రాన్ని రీరిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఖలేజా చిత్రాన్నే కోరుకొంటున్నారు. ఎందుకంటే ఖలేజాలో సీతారామ రాజుగా మహేశ్ వన్ మ్యాన్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఉన్నారు. కానీ ఖలేజా సినిమా రీరిలీజ్ అయ్యే పరిస్థితులు అస్సలు లేవు. కాబట్టి ఖలేజా కావాలంటున్నా అభిమానులకి ఇది నిజంగా గుండె పగిలే వార్తే. ఇక ఈ ఏడాది మహేశ్ బాబు బర్త్ డే రోజు రాజమౌళి సినిమా అప్ డేట్, మురారి రీరిలీజ్ తో ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: