ప్రశాంత్ వర్మ షాకింగ్ పోస్ట్.. ఆ హీరో కోసమేనా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అందరి దర్శకుల లాగా రొటీన్ సినిమాలు తీయకుండా. ఇక ప్రత్యేకమైన కథ కథాంశంతో కూడిన సినిమాలు తీసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. దీంతో ఆ దర్శకుడు ఏదైనా సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకులు అనుకునే విధంగా ప్రభావితం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన ఏ సినిమా తీసిన అందులో ఏదో కొత్తదనం ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఇలాంటి వైవిధ్యమైన కథలతోనే సినిమాలు తీసి వరుస హిట్లు సొంతం చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక మొన్నటికీ మొన్న ఏకంగా తేజ సజ్జా లాంటి చిన్న హీరోతో హనుమాన్ అనే మూవీ తీసి ఏకంగా 300 కోట్ల వసూలు సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అతని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు కూడా మురిసిపోయారు. ప్రశాంత్ వర్మ టాలెంట్ లేకుండా బాలీవుడ్ కి కూడా పాకిపోబోతుంది అంటూ అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో ఈ సినిమా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అసంతృప్తితో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రతి తిరస్కరణ ఒక ఆశీర్వాదం అని మీరు ఒక రోజు తెలుసుకుంటారు అంటూ ఆయన పోస్ట్ పెట్టారు  అయితే ఇది కచ్చితంగా తన సినిమా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కోసమే అంటూ అందరూ అనుకుంటున్నారు. రాక్షసుడు అనే కాన్సెప్ట్ తో రణవీర్ తో ప్రశాంత్ వర్మ సినిమా తీయాలి అనుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: