టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 'నామ్ తో సునా హోగా' అనేది ఈ సినిమా యొక్క ట్యాగ్లైన్.ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరాటి హాట్ బ్యూటీ అయిన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ హిందీ యాక్టర్ అయిన అమితాబ్ పోజ్లో కనిపిస్తూ మూవీ లవర్స్ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాడు. అయితే ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి సాలిడ్ అప్డేట్ ఒకటి వచ్చింది. తాజాగా ఈ మూవీ కంప్లీట్ అయినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు అయిన హరీశ్ శంకర్ ఒక ప్రమోషనల్ వీడియోని విడుదల చేయడం జరిగింది.ఆయన విడుదల చేసిన ఈ వీడియోలో రవితేజ అభిమాని వచ్చి హరీశ్ శంకర్ను నేను రవితేజ డై హార్డ్ ఫ్యాన్ అన్న అంటాడు.
ఆ తర్వాత సినిమా నుంచి ఎదైనా అప్డేట్ ఇవ్వమని కోరతాడు. దీనికి హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇక ఫైనల్ గా అప్డేట్లే మిగిలి ఉన్నాయి. గ్లింప్స్, టీజర్, ట్రైలర్లు అవి అందరు ఇచ్చేవే మనం ఈసారి ఏదైనా కొత్తగా ప్లాన్ చేద్దాం. ఈసారి ఒక షో రీల్ ని వదులుదాం. అందులో డైలాగ్స్ ఉండవు అంటూ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారి మాస్ మహారాజా రవి తేజ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. షాక్, మిరపకాయ్ సినిమాల తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో ఈ మూవీపై ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.మాస్ మాహారాజా రవితేజ ఈ చిత్రంలో రియల్ లైఫ్ లో లాగే అమితాబ్ బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న రవి తేజ ఈ మూవీతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని ఆయన ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.