ఆసక్తి రేపుతున్న సీతా కళ్యాణ వైభోగమే.. ట్రైలర్..!!

murali krishna
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం 'సీతా కళ్యాణ వైభోగమే.ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఓ మై ఫ్రెండ్ టైంలోనే సతీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ మూవీ ఐడియాను ఏడాదిన్నర క్రితమే చెప్పాడు. సుమన్ అనే కొత్త కుర్రాడు, యంగ్ టాలెంట్‌తో చేస్తున్నానని అన్నాడు. సుమన్ ఫస్ట్ ఫిల్మ్, సతీష్ రెండో చిత్రానికి ఆల్ ది బెస్ట్. నీరూస్ సంస్థకు ఆల్ ది బెస్ట్. రాచాల యుగంధర్‌కు ఆల్ ది బెస్ట్. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి' అని అన్నారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. 'టైటిల్ చాలా బాగుంది. మన తెలుగు సంప్రదాయాన్ని చాటేలా ఉంది. మంచి చిత్రం తీసిన యుగంధర్ గారికి మంచి విజయం దక్కాలి. సతీష్ చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఊరికి ఉత్తరాన సినిమా నాకు నచ్చింది. ఈ సినిమాతో సతీష్‌కు పెద్ద విజయం దక్కాలి. సుమన్, గరిమ ఇద్దరూ చక్కగా నటించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. వారిద్దరికీ ఆల్ ది బెస్ట్. గగన్ విహారి మంచి నటుడిగా ఎదుగుతున్నారు. 21న రాబోతోన్న ఈ సినిమాను అందరూ చూసి ఆశీర్వదించండి' అని అన్నారు.
దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. 'మా సినిమా పాటలు టీ-సీరిస్ ద్వారా రిలీజ్ అయ్యాయి. మా ట్రైలర్ అందరికీ నచ్చింది. హర్షిత్ రెడ్డి గారు బలగం సినిమాతో బలాన్ని ఇచ్చారు. హర్షిత్ రెడ్డి గారి కజిన్ సుమన్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. చరణ్ అర్జున్ గారు మంచి పాటలు ఇచ్చారు. నిర్మాత యుగంధర్ గారికి సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉంది. కొందరికి తాతలు, ముత్తాతల పేర్లు కూడా తెలీదు. కానీ రాముడి గుడి లేని ఊరు ఉండదు. ఆయన బతికిన విధానం వల్లే అందరికీ గుర్తుండిపోయారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశాను. నీరూస్ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రం కోసం యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి' అని అన్నారు.హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. 'మా ఈవెంట్‌కు వచ్చిన హర్షిత్ అన్నకి థాంక్స్. ఈ చిత్రం 90s కిడ్స్ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ ప్రయాణంలో మాకు అన్ని రకాల ఎమోషన్స్ ఎదురయ్యాయి. మా ఈ ప్రయాణంలో మేం రెండు చిత్రాలు చేశాం. ఆ రెండూ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. మేం పడిన కష్టాన్ని చూసేందుకు థియేటర్‌కు రండి. నీరూస్ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేమ'ని అన్నారు.నిర్మాత రాచాల యుగంధర్ మాట్లాడుతూ.. 'మా ఈవెంట్‌కు వచ్చిన హర్షిత్ గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి థాంక్స్. చిన్న చిత్రంగా మొదలైనా.. పెద్ద సినిమాగా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో గగన్ విహారి అద్భుతంగా నటించారు. ఊరికి ఉత్తరాన సినిమాతో సతీష్ గారు విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. సుమన్ తేజ్, గరిమలకు ఈ చిత్రంతో మంచి పేరు రాబోతోంది. పూర్ణాచారి గారు పాటలు అద్భుతంగా రాశారు. జూన్ 21న మా సినిమా రాబోతోంది.ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: