"విశ్వం" షూటింగ్ తో బిజీగా గోపీచంద్..!

Pulgam Srinivas
టాలీవుడ్ మాస్ హీరోలలో గోపీచంద్ ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభంలో ఓ సినిమాలో హీరోగా నటించిన అది ఆయనకు మంచి గుర్తింపును తీసుకురాలేదు  . దానితో ఈయన సినిమాల్లో విలన్ పాత్రలో నటించడం మొదలు పెట్టాడు. విలన్ గా మాత్రం ఈయనకు అద్భుతమైన గుర్తింపు లభించింది . ఇక మూడు సినిమాలలో విలన్ గా నటించిన ఈయనకు సూపర్ క్రేజ్ రావడంతో ఆ తర్వాత మళ్లీ హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.

అందులో భాగంగా యజ్ఞం మూవీ తో హీరో గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఈ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటి నుండి గోపీచంద్ కేవలం సినిమాల్లో హీరోగా మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేదు. ప్రస్తుతం ఈ నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకానొక సమయంలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన గోపీచంద్ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం గోపీచంద్ మరియు మరి కొంత మంది ఇతరులపై మేడ్చల్ రైల్వే స్టేషన్ లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే గోపీచంద్ , శ్రీను వైట్ల ఇద్దరికీ మంచి గుర్తింపు దక్కుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఓ చిన్న వీడియోని మేకర్స్ విడుదల చేయగా దానికి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: