వర్షం తర్వాత ఆ మూవీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం... ప్రభాస్..!

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలకు సంబంధించిన ఆల్బమ్స్ కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇప్పటికి కూడా ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం శోభన్ దర్శకత్వంలో రూపొందిన వర్షం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాలోని పాటలు అంటే తనకు ఎంతో ఇష్టం అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమా పాటలను తాను ఎన్నో సార్లు విన్నట్లు కూడా ఆయన చెప్పారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన వర్షం సినిమా సాంగ్స్ తో పాటు మరో సినిమా పాటలు అంటే కూడా ప్రభాస్ కి చాలా ఇష్టం అట. ఆ విషయాన్ని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఆయనే స్వయంగా చెప్పుకోచ్చారు.

తాజాగా ప్రభాస్ మాట్లాడుతూ ... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన జల్సా సినిమా పాటలు అంటే తనకు ఎంతో ఇష్టం అని తాజాగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే జల్సా మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లోని పాటలు ఇప్పటికీ కూడా శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ఇలియానా , పార్వతి మెల్టన్ , కమిలీని ముఖర్జీ హీరోయిన్లుగా నటించగా , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: