ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో రామ్ పోతినేని నెక్స్ట్ ఫిలిం..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని కొంత కాలం క్రితం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో , ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈస్మార్ట్ శంకర్ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయం లోనే రామ్ తన తదుపరి మూవీ ని ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం నవీన్ పోలిశెట్టి హీరో గా అనుష్క శెట్టి హీరోయిన్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందదిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మహేష్ బాబు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈయనకు మంచి గుర్తింపు కూడా ఈ మూవీ ద్వారా లభించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం మహేష్ , రామ్ కి ఓ కథను వినిపించినట్లు , ఆ కథ సూపర్ గా నచ్చడంతో వెంటనే రామ్ ఈ దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే వీరిద్దరి కాంబో మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈస్మార్ట్ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత రామ్ , మహేష్ కాంబో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: