అది జరిగితేనే ప్రభాస్ తో మళ్ళీ మూవీ చేస్తా... శ్రద్ధా కపూర్..!

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ముద్దు గుమ్మలలో శ్రద్ధా కపూర్ ఒకరు. ఈమె కొంత కాలం క్రితం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఆ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. కానీ ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు లో మంచి గుర్తింపు లభించింది.

ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో భారీ సినిమా అవకాశాలు ఏమీ దక్కలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ బ్యూటీ వరుస హిందీ సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ప్రభాస్ తో మళ్లీ నటించడం గురించి ఆసక్తికరమైన సమాధానాన్ని ఇచ్చింది. తాజాగా ఓ నెటిజన్ శ్రద్ధ కపూర్ ని ప్రభాస్ తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు అని అడిగాడు. దానికి ఈ బ్యూటీ స్పందిస్తూ ... ప్రభాస్ ఇంటి నుండి ఫుడ్ పంపించినప్పుడు ఆయన తో మళ్ళీ సినిమా చేస్తాను అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది.

ఇక ప్రభాస్ తో మళ్లీ మూవీ గురించి స్పందిస్తూ శ్రద్ధ కపూర్ ఇచ్చిన ఈ ఫన్నీ ఆన్సర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే సలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ మరికొన్ని రోజుల్లో కల్కి 2898 ఏడి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే ప్రస్తుతం ప్రభాస్ , మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే మూవీ లో కూడా నటిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: