సుమ పై క్రేజీ కామెంట్స్ చేసిన బేబీ హీరోయిన్..!!

murali krishna
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా అక్కడ సుమ కనకాలనే కనిపిస్తుంటారు.బుల్లితెరపై ఆమె బిజీ యాంకర్. సుమ అడ్డా లాంటి షోలకు హోస్ట్ గా చేస్తోంది.సుమ చలాకీగా ఉంటూ పర్ఫెక్ట్ టైమింగ్ తో కామెడీ పంచ్ లు చేస్తూ ఉంటుంది.దీనితో సుమ యాంకరింగ్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు సుమ ప్రవర్తించే విధానం అతిగా అనిపిస్తోంది అంటూ కూడా ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు సుమ అడ్డా షో ప్రతి శనివారం ప్రసారం అయ్యేది. కానీ ఇప్పుడు టైమింగ్స్ మారాయి. ఇక నుంచి సుమ అడ్డా షో మంగళవారం ప్రసారం కానుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ మంగళవారం ప్రసారం అయ్యే షోకి లవ్ మీ చిత్ర యూనిట్ ఆశిష్ రెడ్డి, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య హాజరు కానున్నారు. మంగళ వారం అంజనేయ స్వామి సెంటిమెంట్ కాబట్టి.. సుమ ఆంజనేయ స్వామికి పూజలు చేసింది. ఈ ప్రోమోని కాస్త ఫన్నీగా చూపించారు.సుమతో ఆంజనేయ స్వామి.. ఏంటమ్మా నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర కదా ఉండాలసింది అని అడుగుతారు. ఇక నుంచి మీ దయతో మంగళవారం ఎంటర్టైన్మెంట్ అందిద్దాం అనుకుంటున్నా స్వామి.. మీ ఆశీస్సులు కావాలి అని అడుగుతుంది. తధాస్తు అని ఆంజనేయ స్వామి అంటారు.
అంతటితో సుమ ఆగదు. కక్కుర్తితో స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ సెలెబ్రేషన్ ఈవెంట్స్ కూడా అన్ని నాకే వచ్చేలా చూడు అని అడుగుతుంది. దీనితో ఆంజనేయ స్వామి.. నా చేతిలో ఏముంది అని అడుగుతారు.. గద అని చెబితే.. అది ఇచ్చుకు కొడతా అని వార్నింగ్ ఇస్తారు.ఇక లవ్ మీ చిత్ర యూనిట్ తో సుమ భలే సందడి చేసింది. దెయ్యాన్ని ప్రేమించడం మంచిదా, మనిషిని ప్రేమించడం మంచిదా అని సుమ ఆశిష్ రెడ్డిని అడుగుతుంది. దీనితో ఆశిష్ రెడ్డి దెయ్యమే బెటర్ అని అంటే.. అందుకేనా మా వారు నన్ను ప్రేమించారు అంటూ సుమ నవ్వులు పూయించింది.దెయ్యాలు ఎందుకు రాత్రిళ్ళు మాత్రమే తిరుగుతాయి అని సుమ అడుగుతుంది.. దీనికి వైష్ణవి సమాధానం ఇస్తూ సుమ పరువు తీసేలా సెటైర్ వేసింది. ఎందుకంటే దెయ్యాలు పగలు ఇలా షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటాయి అని సెటైర్ వేసింది. వైష్ణవి సెటైర్ కి సుమ కూడా ఆశ్చర్యపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: