ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో మెగాస్టార్..!!
నగ్మా మొట్ట మొదటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. తన అందచందాలతో కుర్రకారును మెప్పించి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ గా వెలుగొందింది. తెలుగు, తమిళ్, హిందీ అని తేడా లేకుండా అప్పట్లో నగ్మా సృష్టించిన సంచలనాలు ఒకటి అని చెప్పలేము. ఇక అక్క బాటలోనే చెల్లెలు కూడా ఇండస్ట్రీ బాట పట్టారు. అయితే మొదటి చెల్లి జ్యోతిక కంటే.. రెండో చెల్లి రోషిణి ముందు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత జ్యోతిక ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారిపోయారు. నగ్మా రాజకీయాల్లో బిజీగా ఉండగా.. జ్యోతిక ఒకపక్క హీరోయిన్ గా ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతోంది. ఇక రోషిణి పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. వీరి ముగ్గురులో కామన్ గా ఉన్న పాయింట్స్ లో ఒకటి.. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళతో నటించిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. అప్పట్లో చిరు- నగ్మా.. హాట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు లాంటి సినిమాలు వీరిద్దరికి బిగ్గెస్ట్ హిస్ తెచ్చిపెట్టాయి.
ఇక చిరు.. నగ్మా తరువాత ఆమె చెల్లి రోషిణితో రొమాన్స్ చేశాడు. రోషిణిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో చిరు. 1997 లో మాస్టర్ సినిమాతో రోషిణి తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇందులో మొదటి హీరోయిన్ గా ఆమె నటించింది. ఈ సినిమా రోషిణికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక వీరిద్దరూ కాకుండా చిరు.. నగ్మా రెండో చెల్లి జ్యోతికతో కూడా రొమాన్స్ చేసాడు. 2003లో ఠాగూర్ సినిమాలో చిరు సరసన జ్యోతిక నటించి మెప్పించింది. ఇలా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరోగా చిరు గుర్తింపు పొందాడు. తాజాగా ఈ అక్కాచెల్లెళ్ల అరుదైన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.