దిగజారిపోతున్న ఇళయరాజా.. తారాస్థాయిలో ట్రోల్స్?

Purushottham Vinay
ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ముందు, తర్వాత గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఉన్నా కానీ మ్యూజిక్ లవర్స్ మనసుల్లో మాస్ట్రో స్థానమే వేరు. సినిమా వాళ్లు కూడా ఇళయరాజా మీద అభిమానంతో తమ మూవీల్లో ఆయన పాటల ప్రస్తావన తెస్తుంటారు. ఇళయరాజాకు తెగ ఎలివేషన్ ఇస్తుంటారు. తమ సినిమాల్లో ఇళయరాజా పాటలేవైనా బిట్లు బిట్లుగా వాడారు అంటే అది ఆయన మీద అభిమానం, గౌరవంతోనే తప్ప.. ఆ పాటల ద్వారా ఏదో ప్రయోజనం పొందుదామని కాదన్నది మాత్రం వాస్తవం.కానీ ఇళయరాజా చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం అర్థం చేసుకోకుండా ఏదైనా సినిమాలో తన పాట వినిపిస్తే చాలు.. లీగల్ నోటీసుల దాకా వెళ్లిపోతున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా 'కూలీ'కి సంబంధించిన టీజర్లో ఇళయరాజా పాట వినిపించింది. ఐతే అందులో హీరో రజినీ తనకు మంచి మిత్రుడే అయినా సరే.. ఇళయరాజా లీగల్ నోటీసులని ఇచ్చేశారు. తన అనుమతి లేకుండా తన పాట వాడేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు 'మంజుమ్మల్ బాయ్స్' సినిమాలో 'గుణ' మూవీలోని ఓ పాట వాడుకున్నారంటూ నోటీసులు ఇచ్చేశారు. ఇలా ఏ సినిమాలో తన పాట వినిపించినా నోటీసులు ఇచ్చుకుంటూ పోతే.. రేప్పొద్దున ఇళయరాజా పాటను గుర్తు చేసుకోవడానికి భయపడే పరిస్థితి ఖచ్చితంగా రావచ్చు.


తన పాటలకు సంబంధించి హక్కులు, రాయల్టీ విషయంలో ఇళయరాజా గొడవ పడే తీరు ఎప్పట్నుంచో చాలా వివాదాస్పదం అవుతోంది. ఒక పాట మీద సంగీత దర్శకుడితో పాటు గాయకులు, గేయ రచయితలు ఇంకా నిర్మాతలకూ హక్కులు ఉంటాయి. కానీ ఇళయరాజా మాత్రం పాట మీద సర్వ హక్కులూ తనవే అన్నట్లు నీచంగా గొడవలకు దిగడం.. రాయల్టీ కోరడం మీద నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతూ తెగ ట్రోల్ చేస్తున్నారు.గతంలో తనకు ఆప్త మిత్రుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. మ్యూజికల్ కన్సర్ట్స్‌లో తన పాటలు వాడుకుంటున్నాడని నోటీసులు పంపడం కూడా అప్పట్లో చాలా వివాదాస్పదం అయింది. బాలు లాంటి లెజెండరీ సింగర్ తో మాట్లాడి తేల్చుకోవాల్సిన విషయానికి నోటీసులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాలు కూడా అప్పట్లో ఈ విషయమై చాలా బాధ పడ్డారు కూడా. ఇప్పుడేమో ఇలా ఏ సినిమాలో తన పాట వినిపించినా నోటీసులు ఇచ్చేస్తూ నీచంగా బిహేవ్ చేస్తూ ఉన్న గౌరవం పోగొట్టుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: