రష్మీ లవ్ ట్రాక్.. అసలైన నిజాలు బయటపెట్టిన ఆటో రాంప్రసాద్..!!

murali krishna
సినిమా ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసినా.. రష్మీకు జబర్దస్త్ మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో.. రష్మీ చేసే అల్లరి అప్పట్లో మాములుగా పేలలేదు.ఏకంగా వీళ్లిద్దరు లవ్ లో ఉన్నారనే వార్తలు కూడా హల్ చల్ చేశాయి. ఇక అనసూయ తర్వాత జబర్దస్త్ లో ఆ రేంజ్ గ్లామర్ ఎటైర్ గా నిలిచింది. సోషల్ మీడియాలోనూ ఘాటైన ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారకు అందాల విందు వడ్డిస్తుంటుంది. ఇక ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా కొనసాగుతుంది.ఇక ఇదిలా ఉంటే.. బుల్లితెరపై రష్మీ, సుధీర్ లవ్ స్టోరీకి ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్‌కి ఈ ఇద్దరి లవ్ ట్రాకే, టీఆర్పీ బూస్టర్‌గా పని చేసింది. ఎమోషనల్ సీన్స్, ప్రపోజల్స్, ఎంగేజ్‌మెంట్, ఆఖరికి సుడిగాలి సుధీర్, రష్మి పెళ్లి చేసుకున్నట్టుగా కూడా అనేక ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి మల్లెమాల ప్రొడక్షన్స్ కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అందుకుంది. వీళ్ల ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ చూసి నిజంగానే వీళ్లు ప్రేమించుకుంటున్నారని.. ఆఫ్ స్క్రీన్ లో ఒకటవుదామని అనుకుంటున్నట్లుగా అప్పట్లో ఎన్నో వార్తలు హల్ కూడా చేశాయి. కానీ వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. అది కేవలం ప్రమోషనల్ స్టంట్ అని, స్వయంగా వీళ్లిద్దరే చెప్పినా.. పెళ్లి వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రష్మీ లవ్ ట్రాక్ గురించి ఇన్ డైరెక్ట్ గా రామ్ ప్రసాద్ ఓ ప్రోగ్రాంలో చెప్పాడు. రష్మీ తొమ్మిదేళ్లుగా ట్రాక్ నడిపిస్తుందని.. అయితే ఎవరన్నది మాత్రం చెప్పలేదు. దాంతో చాలా మంది ఇంతకీ రష్మీ తొమ్మిదేళ్లుగా నడుపుతున్న లవ్ ట్రాక్ ఎవరితో.. సుడిగాలి సుధీర్ యేనా? లేకపోతే మరొకరా అని అనుకుంటున్నారు. మరీ దీనిపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ రిలీజయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: