రాయన్ : తెలుగు హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు అయినటువంటి ధనుష్ ప్రస్తుతం రయాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ధనుష్ హీరో గా నటిస్తూ ఉండడం మాత్రమే కాకుండా ఈ సినిమాకి స్వీయ దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని మొదట జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమాని జూన్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ ఒక పాటను కూడా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను కూడా తాజాగా అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి సంస్థ వారు దక్కించుకున్నారు.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ విడుదలకు ఇంకా చాలా రోజులే మిగిలి ఉండడంతో ఇప్పటి నుండే ఏషియన్ సురేష్ సంస్థల వారు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సురేష్ సంస్థ ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకోవడంతో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయ్యే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: