"ప్రసన్న వదనం" ఓటిటి హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ తాజాగా ప్రసన్న వదనం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కే దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తోనే ఈయన దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఇకపోతే ఈ చిత్రం విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి కలక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. నిన్నటి తో ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. మొదటి వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమ్మి వేసినట్లు అందులో భాగంగా ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వారాల ధియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాను ఆహా సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: