ఆచార్య తరువాత మీడియా ముందుకు కొరటాల?

Purushottham Vinay
వరుస హిట్లతో ఊపు మీద ఉన్న కొరటాల శివ కేవలం ఓకే ఒక్క ఆచార్య సినిమా ప్లాప్ వలన  ఎన్నో విమర్శలను అందుకోవడం జరిగింది. అలా కెరీర్ మొదటి నుంచి కేవలం హిట్స్ కాదు ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న కొరటాల శివ కేవలం ఆచార్య సినిమా ప్లాప్ కారణంగా దారుణమైన ట్రోల్స్ కు గురయ్యాడు. మిర్చి లాంటి హిట్ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కొరటాల.. ప్రభాస్ ను అతని కెరీర్ లోనే మోస్ట్ స్టైలిష్ లుక్ లో చూపించి అభిమానుల చేత దండాలు పెట్టించి బాహుబలి సినిమా ముందు వరకు ప్రభాస్ కి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని ఇచ్చాడు. ఇక ఆ తరువాత కొరటాల వర్క్ నచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబు అవకాశం ఇచ్చారు. సూపర్ స్టార్ తో శ్రీమంతుడు లాంటి అల్ట్రా క్లాస్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కొరటాల. ఆ తరువాత జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా.. పరాజయమే ఎరుగని దర్శకుడుగా మారాడు. ఆ సమయంలోనే కొరటాల.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య ప్రకటించాడు.


మెగాస్టార్ తో కొరటాల కాంబో అనగానే అంచనాలు ఏకంగా ఆకాశాన్ని తాకాయి. పైగా ఆ మూవీలో రామ్ చరణ్ కూడా ఉండడంతో  థియేటర్లలో బ్లాస్ట్ లే అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఆచార్య మూవీ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి కొరటాలకు చాలా టైమ్ పట్టింది. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. ఇక అప్పుడు మీడియా ముందుకు వచ్చిన కొరటాల మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి కృష్ణమ్మ సినిమా కోసం మీడియా ముందుకు వస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ సినిమాను కొరటాల శివ సమర్పిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ నేడు సాయంత్రం 3 గంటలకు జరగనుంది. ఈ సినిమా మే 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో సత్యదేవ్‌ పాత్ర పవర్ఫుల్‌గా ఉంటుందని ఆయన నటన సహజంగా ప్రేక్షకులకు కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: