ఇకపై ఆ నేపథ్యంలో మూవీలు చేయను... ఆర్జీవి..!

Pulgam Srinivas
ఒకప్పుడు అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుడుగా పేరును సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . అంతటి క్రేజ్ కలిగిన ఈ దర్శకుడు ఈ మధ్య కాలం లో అనేక సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా కనీసం యావరేజ్ విజయాన్ని కూడా అందుకో లేదు . ఇలా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా వరసగా ప్లాప్ అవుతూ రావడంతో ఈయన సినిమాపై ఆసక్తి చూపించే జనాలు కూడా కరు వైపోయారు.

ఇది ఇలా ఉంటే రామ్ గోపాల్ వర్మ కెరియర్ ప్రారంభం నుండి కూడా ఎక్కువ శాతం బయోపిక్ లపై ఆధారపడ్డారు . అందులో భాగంగా ఎంతో మంది జీవిత కథలను వెండి తెరపై ఆవిష్కరించి సూపర్ గా సక్సెస్ అయ్యాడు . ఇక కొంత కాలం నుండి ఆర్జీవి ఎక్కువ శాతం రాజకీయ నేపథ్యాని కి సంబంధించిన సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు . అందులో భాగంగా ఈయన రాజకీయాలపై కొన్ని చిత్రాలను తెరకెక్కించ గా అవి కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి.

ఇలాంటి సందర్భం లోనే ఈయన ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు . ఇకపై రాజకీయ నేపథ్య సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు . ఇకపై కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తాను అని ఈయన తెలిపారు . ఇక తాజాగా ఆర్జీవి "యువర్ ఫిలిమ్స్" అనే కాన్సెప్ట్ ను ప్రారంభించారు. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్ టాలెంట్ ను గుర్తించి వారితో సినిమా తీస్తాం అని ఈయన పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv

సంబంధిత వార్తలు: