ఓటీటీలోకి వచ్చేసిన వెన్నెల కిషోర్ "చారి 111".. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

murali krishna
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'చారి 111'..స్పై యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించాడు.మార్చి 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.చారి 111 మూవీలో వెన్నెల కిషోర్ సరసన సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటించింది. మురళీశర్మ, సత్య మరియు తాగుబోతు రమేష్‌ ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు.ఇదిలా ఉంటే శుక్రవారం (ఏప్రిల్ 5) న చారి 111 మూవీ సైలెంట్‌ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్స్ లేకుండా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. స్పై కథంశానికి కామెడీని జోడించి డైరెక్టర్ కీర్తికుమార్ చారి 111 మూవీని తెరకెక్కించాడు. 

ఇందులో చారి అనే గూఢచారిగా తన కామెడీ టైమింగ్‌తో వెన్నెలకిషోర్ అదరగొట్టాడు..మూవీలో ఎంతటి సీరియస్ ఇష్యూను అయినా సిల్లీగా మార్చే స్పైగా వెన్నెలకిషోర్ క్యారెక్టర్‌ను డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేసాడు.. ఎన్ఐ ఏ, రా వంటి ఇన్వేస్టిగేషన్ సంస్థలు చేస్తోన్న పరిశోధనను ఈ సినిమాలో కాస్త ఫన్నీగా  చూపించడాన్నిప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు.  మిస్టర్ బీన్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ జానీ ఇంగ్లీష్ స్ఫూర్తితో చారి 111 తెరకెక్కినట్లుగా ప్రచారం జరిగింది.చారి 111 మూవీ తర్వాత వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ అనే సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు.

ఈ మూవీలో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. డిటెక్టివ్ బ్యాక్‌డ్రాప్‌లో కంప్లీట్ శ్రీకాకుళం యాసలో రూపొందిన శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ విడుదలకు సిద్ధమైంది.ప్రస్తుతం తెలుగులో పలు భారీ బడ్జెట్ సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తూ వెన్నెలకిషోర్ చాలా బిజీగా ఉన్నాడు..కమల్‌హాసన్‌, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 మూవీతో వెన్నెలకిషోర్ కమెడియన్ గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవన్నున్నాడు. తెలుగులో కూడా మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలలో కమెడియన్ గా అలరించునున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: