పాన్ ఇండియా మూవీకి.. డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న త్రివిక్రమ్ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. ఏకంగా రైటర్ గా కెరియర్ ను మొదలుపెట్టి.. తన డైలాగులతో సినీ ప్రేక్షకులు అందరిని మంత్రముగ్ధులు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ తర్వాత దర్శకుడుగా మారిన తర్వాత కూడా ఎన్నో సూపర్ హిట్లను కొట్టాడు. ఇప్పటివరకు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ డైరెక్టర్.. మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత మరో సినిమాని ప్రకటించలేదు. అయితే ధనుష్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ కు సంబంధించి మరో క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఒకప్పుడు రైటర్ గా  ఎన్నో సినిమాలు హిట్ అవ్వడంలో కీలక పాత్ర వహించిన త్రివిక్రమ్.. ఇక మరోసారి దర్శకత్వ బాధ్యతలను పక్కనపెట్టి రైటర్ గా పని చేయబోతున్నాడట. అది కూడా మామూలు సినిమాకి కాదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయణం నేపథ్యంలో తెరకేకుతున్న సినిమాకి. రణబీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీత పాత్రల్లో రామాయణం మూవీ తెరకెక్కుతుంది అన్నది బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఈ మూవీలో రావణుడికి పాత్రలో యష్ నటించబోతున్నాడట.

 అయితే ఈ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ తెరమీదకి వస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఈ సినిమా తెలుగు వర్షన్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా పని చేయబోతున్నాడు అని సమాచారం. సాధారణంగానే త్రివిక్రమ్ డైలాగులు రాస్తే అదిరిపోతూ ఉంటాయి. అలాంటిది రామాయణం లాంటి ఇతిహాసానికి త్రివిక్రమ్ డైలాగులు రాశాడంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. కాగా ఇంకా పట్టాలెక్కని ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: