"టిల్లు స్క్వేర్" మూవీని చూసిన టాలీవుడ్ హీరోలు..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... డిజే టిల్లు మూవీ లో సిద్దు కి జోడిగా నటించిన నేహా శెట్టి ఈ మూవీ లో ఒక చిన్న పాత్రలో నటించింది. ఈ మూవీ మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.

ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకోవడం మొదలు పెట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా భారీ లాభాలు వచ్చాయి. ఇంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ వీక్షించారు.

ఈ మూవీ లో హీరో గా నటించిన సిద్దు ఈ మూవీ ని నిర్మించిన నాగ వంశీ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ , విశ్వక్ సేన్ ఈ సినిమాను గత రాత్రి చూసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఎన్టీఆర్ కో విశ్వక్ కి అదిరిపోయే రేంజ్ లో నచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా వీరు నలుగురు కలిసి ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ నెల 8 వ తేదీన ఈ మూవీ బృందం సక్సెస్ మిట్ ను నిర్వహించబోతుంది. దానికి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: