ఆ విషయంలో నా ప్లాన్ వర్కౌట్ కాలేదు... వరలక్ష్మి శరత్ కుమార్..!

Pulgam Srinivas
ప్రస్తుతం తమిళ మరియు తెలుగు సినీ పరిశ్రమలలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న నటి మణులతో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఈ బ్యూటీ తమిళ మూవీ ల ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టి అక్కడ మంచి స్థాయికి చేరుకున్న తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ ను చూపించింది. అందులో భాగంగా సందీప్ కిషన్ హీరో గా రూపొందిన "తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈమె ఈ మూవీ తో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది.

ఆ తరువాత వరలక్ష్మి ... మాస్ మహారాజా రవితేజ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ అనే మూవీ లో జయమ్మ అనే పాత్రలో నటించి ఈ పాత్రతో అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇకపోతే తాజాగా వరలక్ష్మికి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనకు తెలిసిందే. తాజాగా వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వరలక్ష్మి తన సినీ మరియు వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వరలక్ష్మీ మాట్లాడుతూ ... నా తొలి సినిమా పోడా పొడి చేస్తున్నప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. ఆ సమయంలో నేను 28 సంవత్సరాల్లోపు స్టార్ గా ఎదిగి ... 32 సంవత్సరాల లో పెళ్లి చేసుకుని ... 34 సంవత్సరాల లో పిల్లల్ని కనాలి అని అనుకున్నాను. కాకపోతే ప్రస్తుతం నా వయసు 38 సంవత్సరాలు. నేను వేసుకున్న ప్రణాళికలేవి వర్కౌట్ కాలేదు అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వరలక్ష్మి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vsk

సంబంధిత వార్తలు: