ఆ రోజు రాడిసన్ పబ్ లో జరిగింది అదే.. షాకింగ్ విషయం చెప్పిన నిహారిక?
ఇలా అడపాదప అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే చివరికి చైతన్య జొన్నల గడ్డను పెళ్లి చేసుకుని ఒక ఇంటి కోడలుగా మారిపోయింది అని చెప్పాలి. దీంతో నిహారిక కెరియర్ ముగిసిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఏకంగా భర్త నుంచి విడాకులు తీసుకున్న నిహారిక మళ్లీ తన సినీ కెరియర్ను ప్రారంభించింది. ఒకవైపు సినిమాలలో నటించడమే కాదు ఇంకోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా కొనసాగుతోంది అని చెప్పాలీ. అంటే మొదటి నుంచి నిహారిక కెరియర్ ఎన్నో వివాదాలతో సాగుతూ వస్తుంది. అయితే గతంలో రాడిసన్ పబ్ లో ఏకంగా నిహారిక డ్రగ్స్ తీసుకుంటూ దొరికింది అంటూ వార్తలు తెర మీదకి రావడం సంచలనంగా మారిపోయాయ్. ఇక నిహారిక మెగా డాక్టర్ కావడంతో ఈ వార్త ఇండస్ట్రీని ఊపేసింది అని చెప్పాలీ.
అయితే ఇలా రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని రాడిసన్ పై పోలీసులు దాడి జరిగిన సమయంలో ఏం జరిగింది అన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మెగా డాటర్ నిహారిక. ఆ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. ఆరోజు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి రాడిసన్ పబ్లో పార్టీ చేసుకున్నాం. సౌండ్ ఎక్కువగా ఉందని మధ్యలోనే బయటికి వచ్చేసాము. ఆ సమయానికి అక్కడ బయట పోలీసులు ఉన్నారు. ఆ తర్వాతే తెలిసింది. ఆ పబ్ లో ఎవరో డ్రగ్స్ తీసుకున్నారని.. కానీ ఆ తర్వాత మా మీద కూడా ఇలాంటి కథనాలు వచ్చాయి అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.