ఆ రోజు రాడిసన్ పబ్ లో జరిగింది అదే.. షాకింగ్ విషయం చెప్పిన నిహారిక?

praveen
మెగా డాటర్ నిహారిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి సినీ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వస్తున్నారు ఆమె. గతంలో ఏకంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ అనే షోలో యాంకర్ గా అవతారం ఎత్తి..  తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నిహారిక ఆ తర్వాత ఇక మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా పరిచయమై కెరియర్ ని  కొనసాగించారు. అయితే హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అవుతుంది అనుకున్నప్పటికీ ఇక ఎందుకో పెద్దగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది నిహారిక.

 ఇలా అడపాదప అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే చివరికి చైతన్య జొన్నల గడ్డను పెళ్లి చేసుకుని ఒక ఇంటి కోడలుగా మారిపోయింది అని చెప్పాలి. దీంతో నిహారిక కెరియర్ ముగిసిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఏకంగా భర్త నుంచి విడాకులు తీసుకున్న నిహారిక మళ్లీ తన సినీ కెరియర్ను ప్రారంభించింది. ఒకవైపు సినిమాలలో నటించడమే కాదు ఇంకోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా కొనసాగుతోంది అని చెప్పాలీ. అంటే మొదటి నుంచి నిహారిక కెరియర్ ఎన్నో వివాదాలతో సాగుతూ వస్తుంది. అయితే గతంలో రాడిసన్ పబ్ లో ఏకంగా నిహారిక డ్రగ్స్  తీసుకుంటూ దొరికింది అంటూ వార్తలు తెర మీదకి రావడం సంచలనంగా మారిపోయాయ్. ఇక నిహారిక మెగా డాక్టర్ కావడంతో ఈ వార్త ఇండస్ట్రీని ఊపేసింది అని చెప్పాలీ.

 అయితే ఇలా రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని రాడిసన్ పై పోలీసులు దాడి జరిగిన సమయంలో ఏం జరిగింది అన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మెగా డాటర్ నిహారిక. ఆ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. ఆరోజు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి రాడిసన్ పబ్లో పార్టీ చేసుకున్నాం. సౌండ్ ఎక్కువగా ఉందని మధ్యలోనే బయటికి వచ్చేసాము. ఆ సమయానికి అక్కడ బయట పోలీసులు ఉన్నారు. ఆ తర్వాతే తెలిసింది. ఆ పబ్ లో ఎవరో డ్రగ్స్ తీసుకున్నారని.. కానీ ఆ తర్వాత మా మీద కూడా ఇలాంటి కథనాలు వచ్చాయి అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: