టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా 'గామి'. వి సెల్యూలాయిడ్ సమర్పణలో విద్యాధర్ కాగిత ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఈ నెల 8 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. మంచి వసూళ్లతో ఈ సినిమా ఎంతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందీ చిత్రం.అయితే శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన విష్వక్సేన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమా వసూళ్ల కంటే కూడా... గామి మేకర్స్ చేసిన ప్రయత్నం బాగుంది. ఈ సినిమాని చాలా రిస్క్ చేసి నిర్మించినట్లు విష్వక్సేన్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు ఆరేళ్లు కష్టపడి తీసినట్లు విశ్వక్ చెప్పారు. కానీ తమ సినిమాకు ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి సహకారం అందలేదని పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో గామి సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి.. తమ కష్టం గురించి మాట్లాడితే బాగుంటుందని విశ్వక్ అభిప్రాయపడ్డారు. టాలీవుడ్లో ఇలాంటి సినిమా ఇప్పటి దాకా రాలేదని ఆయన అన్నారు.
మరో 20 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి గర్వంగా చెప్పుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఇక తాను చెబుతున్న మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్తో చెబుతున్న మాటలు కావని చెప్పారు. గామి సినిమా టాక్ బాగున్నప్పటికీ కాందరు కావాలనే సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని చెప్పారు. ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని తెలిపిన విష్వక్ సేన్ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు దన్యవాదాలు తెలిపారు. అయితే విశ్వక్ ఎన్టీఆర్, రాజమౌళి, మహేష్ బాబుని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసాడని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. అయితే ఇలా సినిమా చూడండి అని అడుగుతున్న విశ్వక్ తన గత సినిమా ఫలక్నామా టైంలో మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ త్వరలో విష్వక్సేన్ రానున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన సరసన నేహాశెట్టి హీరోయిన్గా ఉన్నారు.