రాజమౌళి - మహేష్ కాంబో మూవీ గురించి.. వేణు స్వామి సంచలన కామెంట్స్?

praveen
సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీలపై జ్యోతిష్యం చెబుతూ ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించాడు ఈయన. అయితే కేవలం సినీ సెలెబ్రిటీలు మాత్రమే కాదు రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏంటి అని కూడా చెబుతూ ఉంటాడు. అయితే మొదట్లో వేణు స్వామి ఇలా జ్యోతిష్యం చెప్పినప్పుడు పాపులారిటీ కోసం చేస్తున్నాడులే అని అందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత వేణు స్వామి చెప్పిన ఒక్కో విషయం నిజం కావడంతో ఈయనని నమ్మడం మొదలుపెట్టారు.

 ఎంతో అన్యోన్యంగా క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకుంటారు అని చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి ఇది నిజం కావడంతో అప్పటి నుంచి అందరికీ వేణు స్వామి చెప్పిన విషయాలపై నమ్మకం వచ్చింది. దీంతో కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు రష్మిక మందన్న, నిధి అగర్వాల్,  డింపుల్ హయతి లాంటి వారు ఏకంగా ఈ జ్యోతిష్యుడుతో ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం కూడా చూశాము.  అయితే రాజకీయ నాయకుల విషయంలో కూడా ఇక అటు వేణు స్వామి చెప్పిన ఎన్నో విషయాలు అర్థమవుతూ వచ్చాయి అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ఏకంగా రాజమౌళితో సినిమా చేస్తున్న మహేష్ బాబు.. గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు వేణు స్వామి.

 ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు వెయ్యికోట్ల బడ్జెట్ తో తెరకేక్కుతుంది అన్న టాక్  ఉంది.  ఇక ఇదే విషయంపై స్పందించిన వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబుకు అంత స్టామినా లేదు అంటూ తేల్చేశాడు. రాజమౌళి  మహేష్ కాంబోలో సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారని.. అయితే మహేష్ బాబు మీద అంత బడ్జెట్ వ్యర్థం అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు. మహేష్ బాబుకు అంత మార్కెట్ లేదని.. టికెట్ రేట్లు పెంచిన ఆయన సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి ఉంది అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: