"హనుమాన్" ఓటిటి విడుదలపై స్పందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో హీరో గా నటిస్తున్న తేజ సజ్జ హీరో గా నటించాడు. ఈ మూవీ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే చాలా రోజులుగా ఈ సినిమా ఆ తేదీన "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఈ తేదీన  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అని అనేక తేదీలు వార్తల్లోకి వచ్చాయి. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇకపోతే తాజాగా హనుమాన్ సినిమా "ఓ టి టి" ఎంట్రీ కి సంబంధించి ఈ సినిమా దర్శకుడు అయినటువంటి ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. అసలు విషయం లోకి వెళితే ... త్వరలో హనుమాన్ సినిమా "ఓ టి టి" విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: