ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో మూవీ ఓకే చేసుకున్న గోపీచంద్ మలినేని..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమంలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన రవితేజ హీరో గా రూపొందిన డాన్ శీను అనే మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడు గా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది . ఇక అప్పటి నుండి ఈయన ఇప్పటి వరకు అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు.

అందులో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ప్రస్తుతం ఈయన తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈ దర్శకుడు ఆఖరుగా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత ఈయన రవితేజ హీరో గా మైత్రి సంస్థ బ్యానర్ లో ఓ మూవీ ని ప్రకటించాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా స్టార్ట్ కాలేదు.

ఇక ఆ తర్వాత ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సన్నీ డియోల్ హీరో గా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసింది.  తాజాగా ఈ దర్శకుడు సన్నీ డియోల్ కి ఓ కథను వినిపించక ఆ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే సన్ని , గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: