ఆ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అల్లరించనున్న జవాన్..!

Pulgam Srinivas
పోయిన సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన హిందీ సినిమాలలో జవాన్ మూవీ ఒకటి. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ హీరో గా నటించగా ... లేడీ సూపర్ స్టార్ నయనతార , దీపికా పడుకొనే ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే తమిళ సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి అట్లీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇలా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి ఈ సినిమా పోయిన సంవత్సరం అదిరిపోయే రేంజ్ విజయం సాధించిన సినిమాల లిస్ట్ లో చేరిపోయింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను సూపర్ గా అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క సాటిలైట్ ఆకులను జీ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ను మార్చి 17 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: