'విక్రమార్కుడుకి' సీక్వల్.. కానీ డైరెక్టర్ రాజమౌళి కాదు.. ఎవరంటే?

praveen
సాధారణంగా ఏదైనా సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది అంటే చాలు ఇక ఆ సినిమాకు సీక్వల్ వస్తే బాగుండు అని అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి సీక్వెల్ ఏకంగా దశాబ్ద కాలం గడిచిపోయిన తర్వాత వస్తే ఇక ఆ సీక్వెల్ సినిమా పై ఉండే అంచనాలు అంతా ఇంత కాదు అని చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఇండస్ట్రీలో ఇలాంటి సీక్వెల్ సినిమాలదే ఎక్కువగా హవా నడుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా హీరో రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక మూవీకి పార్ట్ 2 రాబోతుంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

 రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా విక్రమార్కుడు సినిమా ఎంత బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వచ్చిన ప్రేక్షకులు కన్నారపకుండా సినిమాను చూస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది అని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి.  ఇక విక్రమార్కుడు 2 సినిమాకు సంబంధించి ఇక ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. ఈ సీక్వెల్  మూవీఫై నిర్మాత కేకే రాధా మోహన్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కిన భీమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఆయన.

 అయితే రవితేజ హిట్ మూవీ విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ కి సంబంధించిన కథ సిద్ధంగా ఉంది అంటూ నిర్మాత కేకే రాధా మోహన్ చెప్పుకొచ్చారు. కానీ ఈ సీక్వెల్ లో నటించడానికి రవితేజ అంతగా ఆసక్తిగా లేరని.. కానీ ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే సీక్వెల్ మూవీకి కూడా అటు రాజమౌళి దర్శకత్వం వహిస్తాడని అందరూ అనుకుంటుండగా.. ట్విస్ట్ ఇచ్చాడు నిర్మాత కేకే రాధా మోహన్. ఇక సీక్వెల్ మూవీకి రాజమౌళి కాకుండా సంపత్ దర్శకత్వం వహిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: